
షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో కిరాణం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. గ్రా మానికి చెందిన గంజి రాజు కిరాణం దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిరాణ సామగ్రి తగలబడటంతోపాటు నగదు పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. స్థానికులు గమనించి బిందెలతో నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో దుకాణం పూర్తిగా కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది.
యువకుడి అదృశ్యం
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పెద్దబజార్ ప్రాంతానికి చెందిన మామిండ్ల రవింద్ర నిఖిల్ అనే యువకుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడి తల్లి నందిని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.

షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం