TS Election 2023: ఈసారి కేసీఆర్‌ పోటీగా గల్ఫ్‌ మృతుల భార్యలు..!

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఏళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్న గల్ఫ్‌ బాధితులు ఈసారి ఎన్నికల గోదాలో నిలవాలని యోచిస్తున్నారు. సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం లక్షలాది మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఆర్థికంగా చితికిపోయారు.

ఈ నేపథ్యంలో గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలంటూ ఆందోళనలూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే గల్ఫ్‌ కార్మికులు సంఘాలుగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గల్ఫ్‌ కష్టాలు తీరుతాయన్న భావనతో రాష్ట్ర సాధనోద్యమంలోనూ పాల్గొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడచినా గల్ఫ్‌ బాధితుల కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది.

గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని గల్ఫ్‌ జేఏసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికల బరిలో నిలవాలని, తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు.

రోడ్డునపడ్డ కుటుంబాలెన్నో..
కామారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్లారు. నాలుగైదు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. నియోజకవర్గానికి చెందిన 30 వేల మందికిపైగా ఎడారి దేశాలలో ఉన్నారని అంచనా వేస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది గల్ఫ్‌ బాధితులు కూడా ఉన్నారు. గల్ఫ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. వాళ్ల కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి.

కామారెడ్డి మీదే దృష్టి..
సీఎం కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని గల్ఫ్‌ జేఏసీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌ దేశాల్లో 1,800 మంది మరణించారని గల్ఫ్‌ కార్మిక సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 100 మందిని బరిలో దింపాలని భావిస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లి అక్కడ చనిపోయిన వారి భార్యలను పోటీలో నిలపాలని యోచిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన గల్ఫ్‌ కార్మికులంతా తలా కొంత జమ చేసి, నామినేషన్‌ రుసుము చెల్లిస్తారని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో పసుపు రైతులు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసినట్టే ఇక్కడ కూడా నామినేషన్లు వేస్తారని స్పష్టం చేస్తున్నారు.

హామీలు నెరవేర్చాలి..
తెలంగాణ సాధనోద్యమం నుంచి రాష్ట్రం ఏర్పడేదాకా సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు పలుమార్లు గల్ఫ్‌ కార్మికులు, గల్ఫ్‌ బాధితుల కోసం హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రమొచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1,800 మంది గల్ఫ్‌ కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికై నా ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల కోసం నిధి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దిగిరాకుంటే ఎన్నికల బరిలో నిలుస్తాం. కామారెడ్డినుంచి వంద మందిని బరిలో నిలుపుతాం. – సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గల్ఫ్‌ జేఏసీ రాష్ట్ర నాయకుడు

Read latest Kamareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-09-2023
Sep 19, 2023, 08:35 IST
సాక్షి, నిజామాబాద్‌: ప్రతి ఎన్నికల్లో కాలనీల్లో మౌలిక సదుపాయలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి , పెన్షన్ల కేటాయింపు ఈ అంశాలు ముఖ్యంగా...
18-09-2023
Sep 18, 2023, 17:33 IST
కేవలం కేటీఆర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయినందుకే టికెట్‌ దక్కిందంటూ రేఖా నాయక్‌ ఆగ్రహం.. 
18-09-2023
Sep 18, 2023, 13:16 IST
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్‌ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే...
18-09-2023
Sep 18, 2023, 12:19 IST
మెదక్‌: నాడు సమైక్య రాష్ట్రంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించే వారు లేక ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్‌...
18-09-2023
Sep 18, 2023, 11:46 IST
సాక్షి, కరీంనగర్‌: మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పోలీసు...
18-09-2023
Sep 18, 2023, 09:15 IST
మహబూబ్‌నగర్‌: వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపాలన్న ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో...
18-09-2023
Sep 18, 2023, 08:36 IST
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభ విజయవంతమైంది. సభాస్థలితో పాటు...
18-09-2023
Sep 18, 2023, 05:20 IST
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్‌ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్‌...
18-09-2023
Sep 18, 2023, 01:15 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌ బయటకు వేర్వేరుగా ఉన్నట్లు కనిపించినా, అంతర్గతంగా ఇద్దరూ ఒక్కటే అని ఏఐసీసీ...
18-09-2023
Sep 18, 2023, 01:07 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం సహా ఎవరు మద్దతుగా వచ్చినా సరే వంద రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం...
17-09-2023
Sep 17, 2023, 11:13 IST
నర్సాపూర్‌: నీ కాల్మొక్తా సార్‌.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి... అంటూ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రి హరీశ్‌రావును...
17-09-2023
Sep 17, 2023, 07:20 IST
హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్‌ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌...
17-09-2023
Sep 17, 2023, 07:00 IST
హైదరాబాద్: ఓవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు, భారీ బహిరంగసభ.. మరోవైపు బీజేపీ హైదరాబాద్‌ విమోచన సభ కోసం రెండు...
17-09-2023
Sep 17, 2023, 06:38 IST
హైదరాబాద్: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు...
17-09-2023
Sep 17, 2023, 03:43 IST
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రథయాత్రలకు రాష్ట్ర బీజేపీ సమాయత్తమైంది. డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు...
17-09-2023
Sep 17, 2023, 01:53 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని...
17-09-2023
Sep 17, 2023, 01:40 IST
‘స్కూల్‌’ ఫీజు కడితే ఎంబీబీఎస్‌ చదువు  రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్‌ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్‌...
16-09-2023
Sep 16, 2023, 19:10 IST
మూడున్నర దశాబ్దాల రాజకీయానుభవం. ఖమ్మం రాజకీయాలను చక్రం.. 
16-09-2023
Sep 16, 2023, 14:38 IST
సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ...
16-09-2023
Sep 16, 2023, 12:38 IST
జన్నారం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచే తాను బరిలో ఉంటానని ఎమ్మెల్యే రేఖానాయక్‌ స్పష్టం చేశారు. మీ ఆశీస్సులు...



 

Read also in:
Back to Top