పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌

Aug 26 2023 1:34 AM | Updated on Aug 26 2023 8:37 AM

- - Sakshi

జనగామ రూరల్‌: పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి జనగామ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్మెట మండలం వెల్దండకు చెందిన రోహిత్‌, శివప్రసాద్‌ స్థానిక సాన్‌మారియా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఓ ఫంక్షన్‌కు వచ్చిన వారు బైక్‌పై హనుమకొండ రోడ్డు నుంచి యూటర్స్‌ తీసుకుంటూ ఎదురుగా వస్తున్న పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల కాళ్లు విరిగాయి. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఐ ఎలబోయిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇద్దరు మైనర్‌ బాలు రు బైక్‌పై వేగంగా వచ్చి పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టారని, ఇందులో పోలీసు వాహనం నడిపేవారి తప్పులేదని చెప్పా రు.

ఇదిలా ఉండగా.. గాయపడిన ఇద్దరు బాలురకు అయ్యే వైద్య ఖర్చులు తాను భరిస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారని కౌన్సిలర్‌ మల్లవరపు అరవింద్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బాధిత కుటుంబంతో ఫొన్‌లో మాట్లాడి.. కేసు విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement