యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’! | Pakistan Iran make significant progress on ending conflict | Sakshi
Sakshi News home page

యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!

Aug 25 2026 8:43 PM | Updated on Aug 25 2026 8:46 PM

Pakistan Iran make significant progress on ending conflict

ఇస్లామాబాద్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్‌ నేతలు టెహ్రాన్‌లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.

మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొ‍న్నారు.

“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్‌తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్‌లో పోస్టు చేశారు.

దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్‌ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్‌కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement