క్రూయిజ్‌ క్షిపణులు పేల్చిన నార్త్‌ కొరియా | North Korea Launches Several Cruise Missiles In To Sea | Sakshi
Sakshi News home page

క్రూయిజ్‌ క్షిపణులు పేల్చిన నార్త్‌ కొరియా.. మళ్లీ ఉద్రిక్తత

Jan 28 2024 8:14 AM | Updated on Jan 28 2024 11:20 AM

North Korea Launches Several Cruise Missiles In To Sea - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్‌ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. 

‘ఆదివారం ఉదయం 8 గంటల​కు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్‌ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్‌ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే.

ఇదీచదవండి..బ్రిటీష్‌ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement