బెలెం: బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని తరలించారు. అగ్ని ప్రమాదం సందర్బంగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
They chopped down acres of old growth Amazonian rain forest to hold this COP30 event. Then it catches fire. 😂
Absolute metaphor for how the fake climate agenda is burning down.
We need more CO2 to feed plants, not less.#COP30
pic.twitter.com/WqZpT2Zm4j— Bruce (@bruce_barrett) November 20, 2025
వివరాల ప్రకారం.. బ్రెజిల్లో ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంధానకర్తలు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్ వద్ద మంటలు చెలరేగి భవనం గోడలు, పైకప్పును కప్పి ఉంచిన ఫాబ్రిక్ షెల్ పైకి వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 13 మంది గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#COP30 in #Belem has been a logistical nightmare. I hope lessons can be learnt from this experience @Cop30noBrasil pic.twitter.com/z9XvJrtEYD
— Elizabeth Gulugulu (@lizgulaz) November 20, 2025
ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేవలం ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పరికరాలు, మైక్రోవేవ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


