భారతీయులకు షాకిచ్చిన ఇరాన్‌ | Iran Suspended Visa Free Travel For Indians check why | Sakshi
Sakshi News home page

భారతీయులకు షాకిచ్చిన ఇరాన్‌

Nov 18 2025 7:22 PM | Updated on Nov 18 2025 7:56 PM

Iran Suspended Visa Free Travel For Indians check why

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  నవంబర్‌ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మోసం , అక్రమ రవాణా కేసులు పెరిగిన నేపథ్యంలో టెహ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న భారతీయ పౌరులకు వన్-వే టూరిస్ట్ వీసా రద్దు నిబంధనల అమలు 2025  నవంబర్ 22 నుంచి  నిలిపివేస్తున్నట్టు  భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం  ఎక్స్‌లో ఒక పోస్ట్‌ ద్వారా  తెలిపింది.  అంటే నవంబరు 22 తరువాత సాధారణ పాస్‌పోర్ట్‌లున్న భారతీయ పౌరులు ఇరాన్ భూభాగంలోకి  అడుగు పెట్టాలంటే వీసా ఉండాల్సిందే.

భారతదేశం స్పందన
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తమ పౌరులకు జాగ్రత్తలు సూచిస్తూ ఒక అడ్వైజరీ విడుదల చేసింది.ఉపాధికి సంబంధించిన తప్పుడు  హామీలు మూడవ దేశాలకు రవాణా హామీలతో భారతీయ పౌరులను ఇరాన్‌కు ఆకర్షించిన అనేక సంఘటనలపై కేంద్రం దృష్టిని ఆకర్షించిందని విదేశాంగ మంత్రి తెలిపారు. వీసా మినహాయింపు సౌకర్యం ద్వారా వ్యక్తులు ఇరాన్‌కు ప్రయాణించేలా మోసగించారనీ, ఇరాన్‌కు చేరుకున్న తర్వాత, వారిలో చాలా మందిని విమోచన కోసం కిడ్నాప్ చేశారని అందుకే  ఈ మినహాయింపునుటెహ్రాన్ నిలిపివేసిందని పేర్కొంది. ఇరాన్‌ను సందర్శించాలనుకునే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని , వీసా రహిత ప్రయాణం లేదా ఇరాన్ ద్వారా మూడవ దేశాలకు పంపించే ఏజెంట్ల మోసంలో చిక్కుకోవద్దని  మంత్రిత్వ శాఖ సూచించింది.

పర్యాటకం
దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇరాన్ వీసా-రహిత ప్రవేశాన్ని 2024లో ఫిబ్రవరిలో   భారతీయులకు వీసా మినహాయింపును పొడిగించింది. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇస్ఫహాన్,  షిరాజ్ వంటి వారసత్వ నగరాలు, కోమ్ ,మషద్ వంటి తీర్థయాత్ర గమ్యస్థానాలు, ఎడారి ప్రకృతి దృశ్యాలు , పురాతన సిల్క్ రోడ్ మార్గాలతో పాటు, ఇరాన్ భారతీయ ప్రయాణికులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి.ముఖ్యంగా యూరప్ లేదా మధ్య ఆసియాకు వెళ్లే బడ్జెట్ ప్రయాణికులకు ఇరాన్ కూడా ఒక కీలకమైన రవాణా కేంద్రం.

ఇరాన్‌లో మోసం కేసులు
ఈ సంవత్సరం మే ప్రారంభంలో, అక్రమ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు బయలుదేరిన ముగ్గురు పంజాబ్ వ్యక్తులను ఇరాన్‌లో కిడ్నాప్ చేశారు. పంజాబ్‌లోని ఒక ఏజెంట్ హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బిఎస్ నగర్), అమృత్‌పాల్ సింగ్ (హోషియార్‌పూర్) లకు దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చాడు. వారికి ఇరాన్‌లో బస కల్పిస్తామని అతను వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.అయితే, మే 1న వారు ఇరాన్‌లో అడుగుపెట్టిన వెంటనే, వారిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. బాధితుల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం, కిడ్నాపర్లు రూ. 1 కోటి విమోచన క్రయధనం డిమాండ్ చేశారు.ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారతదేశం ఇరాన్ అధికారులను కోరిన తర్వాత ముగ్గురు వ్యక్తులను రక్షించారు. సెప్టెంబర్‌లో, ఇరాన్‌లో ఉద్యోగం కోరుతున్న తమ పౌరులు ఇటీవలి నకిలీ ఉద్యోగ ఆఫర్ల కేసులను దృష్టిలో ఉంచుకుని "కఠినమైన నిఘా" పాటించాలని భారతదేశం హెచ్చరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement