అమెరికాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కుదింపు | Indians in America left disappointed as Modi tight schedul | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కుదింపు

Jun 19 2023 6:19 AM | Updated on Jun 19 2023 6:19 AM

Indians in America left disappointed as Modi tight schedul - Sakshi

న్యూయార్క్‌: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని కుదించారు. క్షణం తీరిక లేకుండా ప్రధాని షెడ్యూల్‌ ఉండడంతో ప్రవాస భారతీయుల్లో అత్యంత ముఖ్యులతో వాషింగ్టన్‌లో చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వెయ్యి మంది వరకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

తొలుత షికాగోలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసినప్పటికీ ప్రధాని బిజీ షెడ్యూల్‌తో తగ్గించాల్సి వచ్చిందని ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ చైర్మన్‌ భరత్‌ బరాయ్‌ వెల్లడించారు.  అధ్యక్షుడు బైడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తొలిసారిగా అధికారిక హోదాలో ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement