
ఎఫ్సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్గా ‘బందా
రవీంద్రనాథ్కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుభాకాంక్షలు
పట్నంబజారు: పదవీ విరమణ తమ బాధ్యతలు ముగిశాయని అని కాకుండా, సామాజిక సేవతో పది మందికి మేలు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషనన్ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) విశ్రాంత ఉద్యోగుల నడవడికే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఎఫ్సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఛైర్మన్న్గా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు అమరావతి రోడ్డులోని మల్లేశ్వరి ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర సమావేశంలో ఈమేరకు ఎన్నికలు నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన ఆలిండియా వైస్ చైర్మన్ ఏఎస్ రామారావు, తాడేపల్లిగూడెంకు చెందిన కె సుధాకరరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. బందా రవీంద్రనాథ్తోపాటు రాష్ట్ర వైస్ చైర్మన్న్గా రాజమండ్రికి చెందిన కె.నాగేశ్వరరావు, కార్యదర్శిగా భీమవరానికి చెందిన జి గోపాలరావు, సహాయ కార్యదర్శిగా విజయవాడకు చెందిన ఆర్ సాయిబాబు, కోశాధికారిగా పశ్చిమ గోదావరికి చెందిన డి మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా చైర్మన్గా పి. యలమంద, కోశాధికారిగా ఎస్.ప్రభాకరరావు ఎన్నికయ్యారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1990 నుంచి యూనియన్ వ్యవహారాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అనేక హోదాలలో పనిచేస్తూ 2022లో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్గా ఎంపికై నట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విశ్రాంత ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు నల్లయ్య, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.