
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్’. జపాన్లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది.
ఈ వనంలో వేలాది వెదురు మొక్కల మధ్య నుంచి కాలిబాట ఉంటుంది. ఆ దారిన నడిచి వెళ్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణానికి నిలయం. సన్నని వెదురు కాండాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎత్తుగా పెరిగి, పచ్చని గుడిసెలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి.
వెదురు ఆకుల గుండా ప్రసరించే సూర్యకాంతి భూమిని చేరే తీరు, తేలికపాటి గాలికి వెదురు కాండాలు ఒకదానికొకటి తాకుతూ సృష్టించే మృదువైన శబ్దం మనసుని మైమరపిస్తుంటాయి. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ, వెదురు కాండాలు వివిధ కోణాల నుంచి కనిపిస్తాయి. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
(చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..)