లోకాన్ని రక్షించడం కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడని మనకు తెలుసు. కానీ.. తన భక్తులను కాపాడుకోవడం కోసం, ఆకాశం నుంచి విరచుకుపడే భీకరమైన పిడుగులను సైతం ఆ భోలాశంకరుడు తన గుండెపైకి తీసుకునే ఒక వింత ఆలయం మన దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. ఇది నిజం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అద్భుతం..!
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆకాశం నుంచి వచ్చే మహా పిడుగు నేరుగా ఆ శివలింగంపైనే పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. కానీ.. ఆ తర్వాత జరిగే వింత చూస్తే మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది..! హిమాచల్ప్రదేశ్లోని మంచు కొండల మధ్య దాగున్న ఆ అంతుచిక్కని సైన్స్ ఏంటి..? ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి..?
హిమాచల్ప్రదేశ్లోని అందమైన కులు లోయ ప్రాంతం అది..! సముద్ర మట్టానికి దాదాపు 2,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ లోయ.. చుట్టూ దట్టమైన అడవులు, హిమాలయ పర్వతాలు. ఈ కొండల పైభాగంలోనే కొలువై ఉన్నాడు బిజ్లీ మహాదేవుడు. హిందీలో 'బిజ్లీ' అంటే మెరుపు లేదా పిడుగు లేదా విద్యుత్తు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ ఆలయం పిడుగులకు నిలయం. సాధారణంగా ఏదైనా కట్టడంపై పెద్ద పిడుగు పడితే ఆ కట్టడం నామరూపాలు లేకుండా పోతుంది.
కానీ, శతాబ్దాలుగా ఈ ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగడం లేదు. అక్కడ ఉండే స్థానికులకు చిన్న గాయం కూడా కాదు. కానీ, ఆ పిడుగులు కేవలం గర్భగుడిలోని శివలింగాన్నే ఎందుకు టార్గెట్గా చేసుకుంటాయనే మిస్టరీని ఇప్పటికీ సైన్స్ ఛేదించలేకపోయింది. ప్రకృతి శక్తులను సైతం తన అధీనంలో ఉంచుకుని, భక్తుల కోసం పిడుగులను సైతం భరించే ఆ బిజ్లీ మహాదేవుని లీల నిజంగానే అమోఘం..! ఆ భోళా శంకరుడి లీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..


