ద్విపాత్రాభినయంలో మరోసారి అక్షయ్‌

Akshay Kumar To Play Dual Role In Up Coming Film - Sakshi

ముంబై: సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని బాలీవుడ్‌ టాక్‌. మిషన్‌ మంగళ్‌ చిత్ర దర్శకుడు జగన్‌ శక్తి తెరకెక్కిస్తున్న చిత్రంలో ‘కిలాడీ’ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు బీ- టౌన్‌ సమాచారం. వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రం. కాగా ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి స్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అక్కీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ గతంలో ద్విపాత్రిభినయంలో నటించిన ‘అప్లాటూన్‌’, ‘రౌడి రాథోడ్‌’, ‘జై కిషన్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.(చదవండి: అల్లుడిగా గర్వించే క్షణం: అక్షయ్‌ కుమార్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top