TSRTC Bus Road Accident At Yousufguda, Rahmath Nagar - Sakshi
Sakshi News home page

HYD: సిటీ బస్సు బీభత్సం.. స్పాట్‌లోనే వ్యక్తి మృతి

Aug 18 2023 12:35 PM | Updated on Aug 18 2023 1:13 PM

TSRTC Bus Road Accident At Yousufguda Rehmathnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సిటీ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న సిటీ బస్సు.. ఎక్స్‌ఎల్‌ సూపర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ఎల్‌ సూపర్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. యూసఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న సిటీ ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న ఎక్స్‌ఎల్‌ సూపర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు ముందు టైరు.. వాహనంపైకి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ఎల్‌ వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్‌, కండక్టర్‌ బస్సు దిగి పరారయ్యారు. 

ఇది కూడా చదవండి: హైటెక్‌ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. స్వీటీ పాండే మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement