సర్పంచ్‌ కుమారుడి కారు ధ్వంసం | Panic in the people of Ramavarappadu due to series of incidents | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ కుమారుడి కారు ధ్వంసం

Jun 22 2024 4:52 AM | Updated on Jun 22 2024 4:52 AM

Panic in the people of Ramavarappadu due to series of incidents

కృష్ణుడి బాల ఆలయంలో విగ్రహాలూ మాయం 

వరుస ఘటనలతో రామవరప్పాడు ప్రజల్లో భయాందోళనలు 

రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్సార్‌ సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్‌ వరి శ్రీదేవి కుమారుడు గణేష్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటు­న్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చా­రు. తన కారును రైవస్‌ కాలువ వంతెన సమీపంలోని  కృష్ణుడి బాల ఆల­యం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్‌ చేశాడు. 

గురు­వారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దా­లు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement