
రెండుసార్లు యూపీఎస్సీలో మెరుగైన ర్యాంక్లు
ఆరేళ్లుగా ఒడిశాలో మంచి పనితీరుతో ఆకట్టుకున్న ఛక్మా
భవానీపట్నా/భువనేశ్వర్: త్రిపురలోని గ్రామీణ నేపథ్యమున్న ధీమన్ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో మెరుగైన ర్యాంక్లు సాధించి శెభాష్ అనిపించుకుని ప్రస్తుతం సబ్–కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఛక్మాను విజిలెన్స్ అధికారులు రెడ్హ్యాండెడ్గా లంచం కేసులో అరెస్ట్చేశారు. ఒడిశాలోని ధర్మగఢ్ సబ్–కలెక్టర్గా ఉంటూ ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
సోమవారం ఆయనను స్థానిక కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం కలహండీ జిల్లాలోని ఛక్మా నివాసంలో విజిలెన్సు అధికారులు రూ.47 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు. తనకు రూ.20 లక్షలు లంచం ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని స్థానిక వ్యాపారిని సబ్–కలెక్టర్ హోదాలో ఛక్మా బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి తమను ఫిర్యాదుచేశారని విజిలెన్స్ ఎస్పీ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన నగదు విషయంలో ఆయన ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో అవినీతి నిరోధక(సవరణ)చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సబ్–కలెక్టర్పై కేసు నమోదుచేసి అరెస్ట్చేశారు.
ఎవరీ ఛక్మా?
త్రిపురలోని కంచన్పూర్కు చెందిన ఈ యువ అధికారి 2019లోనే యూపీఎస్సీలో 722 ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో చేరారు. ఒడిశా కేడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఒడిశాలోని మయూర్భంజ్లోని బరిపదలో అదనపు చీఫ్ కన్జర్వేటర్గా పనిచేశారు. రెండేళ్లకే మళ్లీ 2021లో యూపీఎస్సీ రాసి ఈసారి 482 ర్యాంక్ సాధించారు. దీంతో ఈసారి ఐఏఎస్ హోదా సాధించారు. శిక్షణ తర్వాత ధర్మగఢ్ సబ్–కల్టెర్గా పోస్ట్ఇవ్వడంతో అప్పటి నుంచి అ క్కడే పనిచేస్తున్నారు. రెండుసార్లు అఖిల భారత సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడై అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఆదర్శంగా నిలిచి ఇప్పుడు అవినీతికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.