మంటల్లో చిక్కుకున్న  కంటైనర్లు, కారు  | horrific accident on pune navale bridge | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకున్న  కంటైనర్లు, కారు 

Nov 13 2025 8:09 PM | Updated on Nov 14 2025 5:17 AM

horrific accident on pune navale bridge

8మంది మృతి.. 14 మందికి గాయాలు  

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం  

పుణే: మహారాష్ట్రలోని పుణే నగరంలో ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపైనున్న వంతెనపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రెండు భారీ కంటైనర్‌ వాహనాల మధ్య ఓ కారు చిక్కుకుపోయింది. రాపిడి కారణంగా అవి మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారని, 14 మంది గాయడ్డారని పోలీసులు వెల్లడించారు. 

ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించినట్లు చెప్పారు. ముంబై వైపు వెళ్తున్న కంటైనర్‌ బ్రేక్‌ విఫలం కావడంతో అదుపు తప్పింది. ముందున్న మరో కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ రెండు వాహనాల మధ్య ఓ కారు వెళ్తోంది. అది ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు.   
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement