8మంది మృతి.. 14 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
పుణే: మహారాష్ట్రలోని పుణే నగరంలో ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపైనున్న వంతెనపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రెండు భారీ కంటైనర్ వాహనాల మధ్య ఓ కారు చిక్కుకుపోయింది. రాపిడి కారణంగా అవి మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారని, 14 మంది గాయడ్డారని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించినట్లు చెప్పారు. ముంబై వైపు వెళ్తున్న కంటైనర్ బ్రేక్ విఫలం కావడంతో అదుపు తప్పింది. ముందున్న మరో కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ రెండు వాహనాల మధ్య ఓ కారు వెళ్తోంది. అది ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
महाराष्ट्र –
पुणे में ट्रक के ब्रेक फेल होने से करीब 25 गाड़ियां आपस में टकराईं। कई वाहनों में आग लगी। 9 लोगों की मौत हुई।@YashAhmad8 pic.twitter.com/Gtz1nhHa64— Sachin Gupta (@SachinGuptaUP) November 13, 2025


