పేస్టులా మార్చి.. కాళ్లకు చుట్టుకుని.. 

Gold Smuggling On Rise Shamshabad Airport In Hyderabad - Sakshi

సాక్షి, శంషాబాద్‌(హైదరాబాద్‌): అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి జి–9–450 విమానంలో సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి  చేరుకున్న ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతడి వద్ద బంగారం బయటపడింది. పేస్టులా మార్చిన బంగారాన్ని రెండు కాళ్లకు టేపుతో అతికించి తీసుకొచ్చాడు. 970 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ. 47.55 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి  ఆత్మహత్య 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top