ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


