నార్సింగిలో ఇంజినీర్‌ దారుణ హత్య | Engineer Was Brutally Assassinated In Narsingi | Sakshi
Sakshi News home page

నార్సింగిలో ఇంజినీర్‌ దారుణ హత్య

Jun 29 2024 5:04 PM | Updated on Jun 29 2024 5:22 PM

Engineer Was Brutally Assassinated In Narsingi

నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్‌ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.

వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్‌ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement