రూ.4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్‌ | 6. 6 kg of gold smuggled from Sri Lanka seized in Tamil Nadu | Sakshi
Sakshi News home page

రూ.4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్‌

Aug 14 2024 6:16 AM | Updated on Aug 14 2024 6:16 AM

6. 6 kg of gold smuggled from Sri Lanka seized in Tamil Nadu

సముద్రమార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడుకు.. 

ఇద్దరు నిందితుల అరెస్టు  

సాక్షి, చెన్నై: సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడులోకి బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరిని మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కె­ట్లు  స్వా«దీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మే­ర­కు రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభా­గం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు.

శ్రీలంక నుంచి ఓ పడవలో వచి్చన ఇద్దరు వ్యక్తు­లు కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి, వారిని వెంబడించారు. తిరుప్పాచెట్టి టోల్‌గే­ట్‌ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్‌ చేశారు. వీటిని తరలిస్తున్న కీలకరైకు చెందిన సాధిక్‌ అలీ, షేక్‌ సద్దార్‌ను అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement