
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పంకజ్ ద్వివేదికి ఊహించని అనుభవం ఎదురైంది. జనరల్ మేనేజర్గా ఆయన హోదాను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వపు హోదాలో జనరల్ మేనేజర్గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు పంపించింది.
ఢిల్లీ హైకోర్టులో ద్వివేదికి వ్యతిరేకంగా కేసు పెండింగ్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూనియన్ బ్యాంక్ ఈడీగా ద్వివేది నియామకాన్ని సవాలు చూస్తే ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
విజిలెన్స్ క్లియరెన్స్ లేకుండా ఈడీగా నియమించడం నిబంధనల ఉల్లంఘనంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం ఆమోదం లేకుండా నియామకం ఎలా చేశారని ప్రశ్నిస్తూ.. 2024 ఆగస్ట్లో కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.