
టీవీఎస్ సంస్థ అపాచీ కొత్త మోడల్ను ఆవిష్కరించింది. తాజాగా 2025 అపాచీ ఆర్టీఆర్ 200 4వీను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలతో ఈ మోడల్ను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ధర రూ.1,53,990(ఎక్స్షోరూమ్)గా నిర్ణయించినట్లు పేర్కొంది. వేరియంట్ల వారీగా ధరల్లో హెచ్చతగ్గులుంటాయని చెప్పింది.
ఈ అపాచీ మోడల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. అద్భుతమైన పనితీరు కోసం భద్రతా ఫీచర్లను సైతం మెరుగుపరిచినట్లు చెప్పింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: చైనా పప్పులేం ఉడకవు..
ఓబీడీ2బీ కాంప్లయన్స్: కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
37ఎంఎం అప్సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ సస్పెన్షన్: హ్యాండ్లింగ్, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
హైడ్రోఫార్మింగ్ హ్యాండిల్ బార్: నియంత్రణను మెరుగుపరుస్తుంది. వైబ్రేషన్ను తగ్గిస్తుంది.
డ్యూయల్ ఛానల్ ఏబీఎస్: బ్రేకింగ్ భద్రతను అందిస్తుంది.
3 రైడ్ మోడ్స్: అర్బన్, స్పోర్ట్, రెయిన్.
స్లిప్పర్ క్లచ్: స్మూత్ గేర్ షిఫ్ట్ల కోసం ఉపయోగపడుతుంది.