-
ఆ మోటర్ సైకిల్కి నాటి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు!
రెండు దేశాల సైనిక నాయకుల మధ్య జరిగిన ఆసక్తికర ఘటన. ఇది భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్నప్పుడు చోటు చేసుకున్న రసవత్తర ఘటన. బ్రిటీష్ పాలనా కాలంలో భారత్కి చెందిన సామ్ మానెక్షా, పాక్కి చెందిన యాహ్యా ఖాన్ మధ్య చోటు చేసుకుంది ఈ ఘటన. నిజానికి ఈ ఇద్దరూ ఆంగ్లేయుల పాలన కాలంలో మిలటరీ లీడర్లుగా పనిచేయడంతో వీరి మధ్య కొద్దిపాటి స్నేహం ఏర్పడింది. ఆ టైంలో మానెక్షా లెఫ్టినెంట్ కల్నల్ పనిచేయగా, యాహ్యా ఖాన్ మేజర్. అయితే యహ్యా ఖాన్కి మానెక్షా వద్ద ఉండే ఎరుపు రంగు మోటార్ సైకిల్పై ఆశ ఉండేది. దీంతో ఒకరోజు యహ్యా ఖాన్ మానెక్షాని నాకు ఆ సైకిల్ ఇవ్వు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు. మానెక్ష ఆ వెయ్యి రూపాయాలకు ఆశపడి తన వద్ద ఉన్న ఎరుపు రంగు మోటార్ సైకిల్ని ఇచ్చేయడం జరిగింది. ఈలోగా బ్రిటీష్ వాళ్ల మనదేశాన్ని విడిచిపెట్టిపోవడం వెళ్తూ పాక్ని అంటగట్టడం జరిగింది. అదికాస్త 1947లో మన భారత్ నుంచి వేరుగా దేశంగా ఏర్పడటం అన్నీ చకచక జరిగిపోయాయి. దీంతో యహ్యా ఖాన్ ఆ సైకిల్ని తీసుకుని పాక్కి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే పాపం మన భారత ఆర్మీ నాయకుడు సామ్ మానెక్షాకి మాత్రం యహ్యా ఖాన్ డబ్బు చెల్లించ లేదు. ఆంగ్లేయులు వెళ్లిపోయిన అనంతరం మానెక్షా మన భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనుకోకుండా 1971లో భారత్కి పాక్కి మధ్య భయానక యుద్ధం జరిగింది. ఆ టైంలో మన మానెక్ష భారత ఆర్మీ ఛీప్గా సైన్యాని నిర్వహిస్తుండగా, యహ్యా ఖాన్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో మన మానెక్ష సారథ్యంలో భారత ఆర్మీ పాక్ సైన్యాన్ని మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. ఈ యుద్ధం కారణంగానే బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడటం కూడా జరిగింది. ఈ మేరకు ఓ పత్రిక ఇంటర్వ్యూలో మానెక్షా ఈ ఘటన గురించి చెబతూ తాను 24 ఏళ్లుగా తమన మోటర్ సైకిల్ డబ్బులు వెయ్యి రూపాయాలు ఎప్పుడు వస్తాయా? అని 24 ఏళ్లుగా ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే యహ్యా ఖాన్ ఇప్పుడూ తన దేశ ఓటమితో తనకు మూల్యం చెల్లించాడంటూ చమత్కరించారు మానెక్షా. అలాగే తాను యహ్యా ఖాన్ని ఎప్పుడూ ఆ వెయ్యి రూపాయల్ని వడ్డితో సహా చెల్లించమని అడగను కూడా అడలేదని చెప్పుకొచ్చారు. దీని గురించి 2008లో ఆంగ్ల పత్రికా కాలమిస్ట్ రాసుకొచ్చాడు. ఐతే ఇంటర్వ్యూలో మానెక్ష ఆ ఘటనను ఎన్నడూ మర్చిపోలేనని అన్నాడు. ఇద్దరూ వారి దేశాలకు సంబంధించిన అత్యున్నత హోదాలో సాగినా..స్నేహితులుగా ఉన్నప్పుడూ జరిగిన ఘటన మానెక్షని ఎన్నటికీ మర్చిపోనివ్ల లేదు. ఆ ఘటన మానెక్షా మనుసులో మర్చిపోలేని ఘటనగా ఉండిపోయింది. స్నేహం పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం భవిష్యత్తులో కాలం ఎలా బదులు తీర్చుతుంది అనేందుకు ఉదాహరణే ఈ గాథ. అదీగాక తనను మోసం చేసి తన వస్తువుని స్నేహితుడి పట్టుకుపోతే ఆ వ్యక్తి పట్ల సదరు స్నేహితుడి మనుసులో ఎలాంటి ముద్రపడుతుందనేందుకు ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఇక యుద్ధం గెలిచినప్పటికీ దీనివవల్ల మానవ నష్టం ఎంత ఉంటుందో గుర్తించాడు జనరల్ మానేక్షా. ఇక యహ్యాఖాన్ తర్వాత క్రమక్రమంగా రాజీకయ పతనాన్ని చవిచూశాడు. కాగా ఈ ఘట్టం 2003లో బాలీవుడ్లో తీసిన శ్యామ్ బహుదూర్ సినిమాలో కూడా ఉంది. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. (చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!) -
బీర్తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!
సాక్షి, ముంబై: బీర్తో నడిచే బైక్ ఎపుడైనా చూశారా? అవును బీర్ బైకే.. అది కూడా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందట. ప్రస్తుతం ఈ బీర్ బైక్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్ బైక్ సృష్టికర్త. గతంలో రాకెట్తో నడిచే టాయిలెట్, జెట్తో నడిచే కాఫీపాట్ను కనుగొన్న మైఖేల్సన్ తాజా బీర్బైక్ను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను ఫాక్స్9తో షేర్ చేసిన అతగాడు బైక్లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పని చేస్తుందని మైఖేల్సన్ తెలిపారు. బీరుతో నడిచే మోటార్సైకిల్ బ్లూమింగ్టన్లోని అతని గ్యారేజీలో నిర్మించారట. ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెప్పాడు మైఖేల్సన్. గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇదొక వినూత్న ఆవిష్కరణ అని వెల్లడించాడు. అంతేకాదు రెడ్ బుల్, కారిబౌ కాఫీతో సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్ ఇంధనంగా మార్చుకోవచ్చని కూడా పేర్కొన్నాడు. తాను డ్రింక్ చేయనని, అందుకే దీన్ని ఇంధనంగా మలచి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు. రాకెట్మ్యాన్గా పేరొందిన మైఖేల్సన్ బీర్ బైక్ స్ధానిక కార్ షోస్లో టాప్ ప్లేస్ స్ధానంలో నిలవడం విశేషం. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్ను ఉంచుతానని మైఖేల్సన్ తెలిపాడు. 9 నెలల క్రితం తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను షేర్ చేశాడు. అతని కుమారుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు. -
షాకింగ్ వీడియో: ఒకే బైక్పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
మూడు ఫుల్లు.. మూడు హాఫ్ టికెట్లు..
సామర్లకోట: ఇద్దరికే పరిమితం కావాల్సిన మోటార్ సైకిల్పై నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఆరుగురు ప్రయాణించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సామర్లకోట – పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ మోటార్ సైకిల్పై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు. అసలే ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికం. ఏమాత్రం బ్రేక్ వేసినా వెనుక ఉన్న వారు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ ఇలా బైక్పై వెళ్లడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు. -
వ్యాపారం అచ్చిరావట్లేదని.. ఇంటర్నెట్లో చూసి బైక్లను..
సాక్షి, కరీంనగర్: వృత్తి, వ్యాపారం అచ్చిరాక పోవడంతో అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్ చూశాడు.. ఒక ఛానల్లో తాళం వేసి ఉన్న బైక్లను ఎలా తీయాలో నేర్చుకున్నాడు. కరీంనగర్ కమిషనరేట్లో పలు ప్రాంతాల్లో 12 బైక్లను దొంగతనం చేసి, చివరికి పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ టౌన్ డివిజన్ డాక్టర్ పి.అశోక్ తన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్(33) అలియాస్ జల్సా ఆటోడ్రైవర్గా పని చేసేవాడు. 2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్లో వివాహం చేసుకొని, 2012 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత గుండి ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్, కారు, వివిధ వాహనాలు నడిపాడు. 2020 జనవరిలో గోపాల్రావుపేటలో ఆటోస్టోర్ పెట్టుకున్నాడు. లాక్డౌన్ వల్ల నష్టం రావడంతో షాపు తీసేసి, కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్ మంకమ్మతోటలో భార్య, కుమారుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరగడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్లో తాళం వేసి ఉన్న బైక్లను ఏ విధంగా తీయాలో నేర్చుకొని, కరీంనగర్ టూటౌన్ పరిధిలో 9, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి నామాపూర్లలో 3 బైక్లు దొంగిలించాడు. నంబర్ ప్లేట్లు తీసేసి, తన స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు శ్రీనివాస్ను మంగళవారం పద్మనగర్ బైపాస్రోడ్డులో అరెస్టు చేశారు. అతడు, అతని స్నేహితుల వద్ద ఉన్న 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్రెడ్డి, పవన్లను సీపీ కమలాసన్రెడ్డి అభినందించి, రివార్డులు ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement