
ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్ బుకింగ్స్ ప్రారంభం
జులై నుంచి డెలివరీలు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా ‘2025 ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్’ పేరుతో అడ్వెంచర్ బైక్ను విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 755 సీసీ లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది.
ఇది 9,500 ఆర్పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్కు 6–స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో థ్రోటిల్–బై–వైర్ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్–కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్లులున్నాయి.
ఇదీ చదవండి: కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్
ఇంజిన్ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్ వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.