మెటార్‌సైకిల్‌ బాంబు పేలి ముగ్గురు మృతి | 3 civilians killed in motor cycle bomb blast | Sakshi
Sakshi News home page

మెటార్‌సైకిల్‌ బాంబు పేలి ముగ్గురు మృతి

Jan 22 2018 9:09 AM | Updated on Jan 22 2018 9:25 AM

3 civilians killed in motor cycle bomb blast - Sakshi

బ్యాంకాక్‌: మోటార్‌ సైకిల్‌ బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో 19మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న తిరుగుబాటుదారుల ప్రాంతమైన యాలా పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డౌన్‌టౌన్‌లోని పంది మాంసం అమ్మే ఓ దుకాణం ముందు మోటార్‌ సైకిల్‌ను పార్కు చేసి ఉంచారని, అందులోని బాంబులు పేలడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట ఇలాంటి సంఘటనే మొదటగా మెజారిటీ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement