
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 65,489 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 19,438 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రధానంగా అపోలో హాస్పిటల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)