మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 492.70 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 77,235.46 వద్ద, నిఫ్టీ 132.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 24,154.90 వద్ద నిలిచాయి.
జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, టొరెంట్ పవర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


