Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9.25 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 471 పాయింట్ల నష్టంతో 64,874 పాయింట్ల వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 19,279 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ప్రధానంగా అదానీ ఎంటర్ప్రైస్, హిందాల్కో, టాటా మోటర్స్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటర్స్ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇక ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)