డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య.. | Degree Student Vaishnavi Committed Suicide In Karimnagar | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..

Apr 2 2024 12:46 PM | Updated on Apr 2 2024 12:46 PM

Degree Student Vaishnavi Committed Suicide In Karimnagar

కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.

డిగ్రీ ఫస్టియర్‌ ఫస్ట్‌ సెమ్‌, సెకండియర్‌లో సెకండ్‌ సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement