దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హాకిష్ విరామం తరువాత గ్లోబల్ ఈక్విటీల క్షీణత మధ్య దేశీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కొద్దిగా పడిపోయాయి. ఈరోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 29 పాయింట్లు ఎగబాకి 24,115 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 పాయింట్లు పెరిగి 77,220 వద్ద ట్రేడవుతోంది.
ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.17 శాతం, 0.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.
యూఎస్, ఇరాన్ మధ్యంతర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత బ్రెంట్ ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ కు 1.48 శాతం తగ్గి 78.37 డాలర్లుగా ఉంది. ఇక బంగారం, వెండి ఫ్యూచర్స్ వరుసగా 0.93 శాతం, 1.9 శాతం నష్టపోయాయి.


