హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు | Hindenburg's Latest Allegations Targeting SEBI, Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Aug 12 2024 9:50 AM | Updated on Aug 12 2024 10:22 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు  సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 24,257కు చేరింది. సెన్సెక్స్‌ 339 పాయింట్లు నష్టపోయి 79,363 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.18 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 79.61 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.94 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.13 శాతం, నాస్‌డాక్‌ 0.5 శాతం  లాభపడ్డాయి.

సెబీ చైర్‌పర్సన్‌ మాధవీ పురీ బచ్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున స్టాక్‌ సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలు విడుదల చేసే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్‌ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న(గురువారం) ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగురోజులకు పరిమితం కానుంది.

ఈ వారం వెలువడే ఎకనామిక్‌ డేటా వివరాలు..

మంగళవారం: జులై ప్రొడ్యుసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌

బుధవారం: కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌

గురువారం: జులై రిటైల్‌ సేల్స్‌ డేటా

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement