లాభాలతో ముగిసిన మార్కెట్లు | stock market closing updates aug 21 | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన మార్కెట్లు

Aug 21 2024 3:59 PM | Updated on Aug 21 2024 4:02 PM

stock market closing updates aug 21

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనైన భారతీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు ఎఫ్‌ఎంసీజీ షేర్ల కారణంగా పుంజుకుని సానుకూలంగా స్థిరపడ్డాయి.

326 పాయింట్ల బ్యాండ్‌లో దూసుకెళ్లిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 80,905 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 71 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 24,770 వద్ద స్థిరపడింది.

టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఈరోజు సెన్సెక్స్‌లో 1 శాతం నుంచి 2.5 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ ఎం, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.6 శాతం వరకు దిగజారి నష్టాల్లో అగ్రస్థానంలో నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement