డిజిటల్ విధానంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేలా ’షగున్ సిప్’ను ప్రవేశపెట్టినట్లు యాక్సిస్ ఎంఎఫ్ వెల్లడించింది.
యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో గ్రాముల లెక్కన పెట్టుబడులు పెట్టేందుకు ఈ తరహా డిజిటల్ సిప్ ఫీచరును ప్రవేశ పెట్టడం పరిశ్రమలోనే ఇది తొలిసారని పేర్కొంది. 25 కేజీల దాకా బంగారం, 50 కేజీల వరకు వెండి కొనుగోలు కు అవసరమయ్యే మొత్తాన్ని పోగు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. డిజిటల్గా ఇన్వెస్ట్ చేయడంతో ఫిజి కల్ రూపంలో అదనపు వ్యయాలు, భద్రపర్చు కోవాల్సిన భారం ఉండదని సంస్థ తెలిపింది.


