
ముంబయి: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 35,577 కోట్ల రూపాయల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించింది. గత సంవత్సరం 38,238 కోట్లతో పోలిస్తే, రెగ్యులర్ ప్రీమియం 11% వృద్ధి చెందింది. ప్రొటెక్షన్ న్యూ బిజినెస్ ప్రీమియం 4,095 కోట్ల రూపాయలు, వ్యక్తిగత ప్రొటెక్షన్ ప్రీమియం 793 కోట్ల రూపాయలుగా నమోదైంది.
వ్యక్తిగత న్యూ బిజినెస్ ప్రీమియం 26,360 కోట్ల రూపాయలతో 11% వృద్ధి సాధించింది. పన్ను తర్వాత లాభం 2,413 కోట్ల రూపాయలతో 27% వృద్ధి చెందగా, సాల్వెన్సీ నిష్పత్తి 1.96 వద్ద బలంగా ఉంది. ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలకు 15% వృద్ధి చెందింది, డెట్-ఈక్విటీ మిశ్రమం 61:39గా ఉంది. 94% డెట్ పెట్టుబడులు ట్రిపుల్ ఏ, సావరిన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 309,034 మంది బీమా నిపుణులు, 1,110 కార్యాలయాలతో బ్యాంకాషూరెన్స్, ఏజెన్సీ, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, పీవోఎస్, వెబ్ అగ్రిగేటర్ల ద్వారా విస్తృత సేవలు అందిస్తోంది.
2025 మార్చి 31 నాటి పనితీరు
వ్యక్తిగత రేటెడ్ ప్రీమియం 19,354 కోట్ల రూపాయలతో 22.8% మార్కెట్ వాటా.
ఏపీఈ 21,417 కోట్ల రూపాయలతో 9% వృద్ధి.
వ్యక్తిగత న్యూ బిజినెస్ సమ్ అష్యూర్డ్ 2,76,918 కోట్ల రూపాయలతో 43% వృద్ధి.
13 నెలలు, 61 నెలల పర్సిస్టెన్సీలో 63 బీపీఎస్, 528 బీపీఎస్ మెరుగుదల.
వీవోఎన్బీ 5,954 కోట్ల రూపాయలతో 7% వృద్ధి, మార్జిన్ 27.8%.
ఐఈవీ 70,250 కోట్ల రూపాయలతో 21% వృద్ధి.
ఆపరేటింగ్ రిటర్న్ ఆన్ ఎంబెడెడ్ వాల్యూ 20.2%.
ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలతో 15% వృద్ధి.
సాల్వెన్సీ నిష్పత్తి 1.96.