రోల్స్‌ రాయిస్‌.. 2,500 మందికి లేఆఫ్స్‌ | Rolls Royce CEO Turnaround Plan for share Price Surge | Sakshi
Sakshi News home page

రోల్స్‌ రాయిస్‌.. 2,500 మందికి లేఆఫ్స్‌

Mar 26 2025 11:38 AM | Updated on Mar 26 2025 12:02 PM

Rolls Royce CEO Turnaround Plan for share Price Surge

ప్రముఖ బ్రిటిష్‌ లగ్జరీ కారు, ఏరో ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ గడిచిన ఏడాది కాలంలో 2,500 మందికి లేఆఫ్స్‌ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది మేనేజర్‌ స్థాయి ఉద్యోగులేనని ఫార్చ్యూన్ రిపోర్ట్‌ తెలిపింది. కంపెనీ సీఈఓగా టుఫాన్ ఎర్గిన్‌బిలిక్‌ బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలో విభిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా కొందరు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడంతోపాటు సంస్థ షేరు ధర 500 శాతం ఎగబాకి రికార్డు నెలకొల్పింది.

రోల్స్‌ రాయిస్‌ సీఈఓగా టుఫాన్ ఎర్గిన్‌బిలిక్‌ 2023 చివర్లో బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో  నిర్దిష్ట గడువులోపు కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించున్నారు. సంస్థ రెవెన్యూ పెంచడంలో భాగంగా 2,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ‍ప్రకటించారు. దాంతోపాటు కొన్ని విధానపరమైన నిర్ణయాలతో సంస్థ ఆదాయాన్ని ముందుగా నిర్ణయించుకున్న గడువులోపే మార్కెట్ విలువకు 70 బిలియన్ డాలర్లకు పైగా జోడించారు. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించి స్టాక్‌ ధర ఏకంగా ఏడాదిలో 500 శాతం ఎగబాకేలా చేసింది.

ఇదీ చదవండి: భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

ఈమేరకు ఎర్గిన్‌బిలిక్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘రోల్స్ రాయిస్ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేశాం. దాంతో కంపెనీలో 42,000 మంది ఉద్యోగులు అప్రమత్తం అయ్యారు. ఇది పనిపై మరింత ఫోకస్‌ పెట్టేందుకు కారణమైంది. కరోనా సమయంలో విమాన ప్రయాణాలు తగ్గడంతో కంపెనీ కాంట్రాక్టులు తగ్గిపోయాయి. తిరిగి మార్కెట్‌లో క్రమంగా పుంజుకున్నాం. రోల్స్ రాయిస్ ఒక బర్నింగ్ ప్లాట్‌ఫామ్‌. ఉద్యోగుల మెరుగైన ఆలోచనలను అమలు చేసేందుకు 500 మందికి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లను నిర్వహించాం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement