ఆన్‌లైన్‌ పేమెంట్‌ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా | RBI said that all digital payment transactions will have to ensure that authentication | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పేమెంట్‌ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా

Aug 1 2024 1:08 PM | Updated on Aug 1 2024 1:10 PM

RBI said that all digital payment transactions will have to ensure that authentication

ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్‌) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్‌బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్‌డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్‌వర్డ్‌, పిన్‌, సాఫ్ట్‌వేర్ టోకెన్‌లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్‌ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.

కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్‌ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్‌, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్‌ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్‌ ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్‌ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement