పేటీఎంకు పెరిగిన నష్టాలు | Paytm parent Q4 net loss widens to Rs 550 crore | Sakshi
Sakshi News home page

పేటీఎంకు పెరిగిన నష్టాలు

May 23 2024 5:46 AM | Updated on May 23 2024 8:15 AM

Paytm parent Q4 net loss widens to Rs 550 crore

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్‌ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌(పీపీబీఎల్‌)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. 

బ్యాంక్‌ భవిష్యత్‌ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో  రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్‌ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు.  ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది.  
ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement