
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.
ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
ఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.

ఆధార్ లింక్ చేసుకోండిలా..
ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.
'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.
మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.
మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది.