
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఈయన ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇటీవల ముకేశ్ అంబానీని పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు 'అనంత్ లాధా' కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంత్ లాధా.. ముకేశ్ అంబానీని కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఆ సమయంలో 'విజయం సాధించడానికి ఏమి కావాలి?' అని ప్రశ్నించారు. 'ఫోకస్, డెలిగేట్, డైవర్సిఫై' ఈ మూడు ఉంటే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని రిలయన్స్ అధినేత సింపుల్గా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం లాధాను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
ముకేశ్ అంబానీ చెప్పిన సక్సెస్ ఫార్ములాను.. అనంత్ లాధా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. ఇది నెటిజన్లను కూడా ఎంతంగానో ఆకట్టుకుంది. ఇది చాలా గొప్ప సలహా అని ఒక నెటిజన్ వెల్లడించగా.. ఇది బంగారం లాంటి సలహా అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా అంబానీ ఇచ్చిన సలహా ఎంతోమందిని ఫిదా చేసింది.