Sakshi News home page

మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రమోటర్ల దాతృత్వం

Published Sat, Jul 29 2023 6:27 AM

Motilal Oswal, Raamdeo Agrawal to donate 10 percent stake each for charity - Sakshi

న్యూఢిల్లీ: మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రమోటింగ్‌ కంపెనీ మోతీలాల్‌  ఓస్వాల్, ప్రమోటర్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది.

ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్‌ అదానీ, శివ్‌నాడార్, నందన్‌ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని గ్లైడ్‌ టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్‌ టెక్‌ అనేది మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్‌ ఓస్వా ల్‌ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. 

Advertisement

What’s your opinion

Advertisement