భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్ | Mercedes Benz EQS is Brand 200000th Made in India Model | Sakshi
Sakshi News home page

భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్

Apr 19 2025 9:14 PM | Updated on Apr 19 2025 9:16 PM

Mercedes Benz EQS is Brand 200000th Made in India Model

జర్మన్ కంపెనీ అయిన 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2,00,000 ప్యాసింజర్ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేసిన మొట్టమొదటి లగ్జరీ కార్ బ్రాండ్‌గా అవతరించింది. మహారాష్ట్రలోని పూణేలోని చకన్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ కారు EQSను విడుదల చేయడంతో కంపెనీ ఈ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

మెర్సిడెస్ బెంజ్ పూణేలోని చకన్ ప్లాంట్‌లో 50000 యూనిట్లను అసెంబుల్ చేయడానికి 19 సంవత్సరాలు (1995 నుంచి 2014 వరకు) పట్టింది. ఆ తరువాత 1.50 లక్షల యూనిట్లను కేవలం పదేళ్లలో (2015 నుంచి 2025 వరకు) ఉత్పత్తి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఉత్పత్తి సుమారు 470 శాతం పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement