కోల్కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ దీన్దయాళ్ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.
1972లో డాలర్ ఇండస్ట్రీస్కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.


