రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న సమయంలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ. 51కే సరసమైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
మైళ్ల దూరంలో ఉన్నా లేదా దగ్గర్లో ఉన్నా BSNLతో మీకు కనెక్ట్ అయి ఉంటుంది అని ట్వీట్ చేస్తూ.. కంపెనీ రూ.51 ప్లాన్ గురించి వివరించింది. ఇది కేవలం ప్రారంభ కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. దీని ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. కాగా ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే అని తెలుస్తోంది. తేదీని మళ్లీ పెంచుతారా?, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Miles apart or just around the corner—stay connected to what matters most with BSNL.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #TechUpdates #BSNLServices #SmartIndia #EverydayConnectivity #offer51@CMDBSNL @robertravi21 pic.twitter.com/KtiQXVrKCf
— BSNL India (@BSNLCorporate) June 19, 2026


