బ్యాంకింగ్‌ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు

Bank privatisation to happen as per schedule - Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికాబద్ధంగా అనుకున్న ప్రకారం ముందుకు సాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘‘బ్యాంకు ప్రైవేటీకరణ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతుంది. దానిలో ఎటువంటి మార్పు లేదు’’ అని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె ఇక్కడ ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఐడీబీఐ బ్యాంక్ కాకుండా, 2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరిలో చెప్పారు.

ప్రస్తుతానికి, ఈ విషయంలో కొంచెం పురోగతి కనిపించింది. తాజా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను 2021 ఏప్రిల్ లో ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినందున, ప్రైవేటీకరించనున్న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల తాజా జాబితాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top