క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ.. | Anand Mahindra's Rakshabandhan Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..

Aug 31 2023 10:00 AM | Updated on Aug 31 2023 10:14 AM

Anand mahindra rakshabandhan tweet viral - Sakshi

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'రక్షాబంధన్' సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రక్షాబంధన్ సందర్భంగా తన చిప్పప్పుడు తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా సిస్టర్ రాధిక నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసాను. అయితే దానిని ఎవరో దయతో కలర్ ఫోటోగా మార్చారు' అంటూ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చెల్లెలు అనుజకు క్షమాపణలు అంటూ' ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి వేల సంఖ్యలో లైక్స్ రాగా, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement