Sakshi News home page

ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌

Published Tue, Jul 25 2023 8:15 PM

Airtel Offering Xstream Play Premium With Rs 148 Plan - Sakshi

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కేవలం రూ.148 చెల్లించి ఎక్స్‌ ట్రీమ్‌ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని తెలిపింది. తద్వారా యూజర్లు 15 ఓటీటీలను వీక్షించే అవకాశం కలగనుందని వెల్లడించింది. . అంతేకాదు రూ.148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. 

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ ఎంపిక చేసుకున్న కస్టమర్లు సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్‌ నౌ,హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ లభిస్తుంది. అయితే, దీంతో పాటు రూ.149 రీఛార్జ్‌తో కూడా 28 రోజులపాటు ఈ ఓటీటీల సదుపాయాన్ని వినియోగించవచ్చని స్పష్టం చేసింది. 

గతంలో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో 15 కంటే ఎక్కువ ఓవర్-ది-టాప్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వీటిలో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ. 359, రూ. 399, రూ. 499, రూ. 699, రూ. 839, రూ. 999. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల డేటా, అపరిమిత టాక్ టైమ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 

Advertisement

What’s your opinion

Advertisement