Adani Group set to acquire remaining 51% stake in Quintillion Business Media - Sakshi
Sakshi News home page

పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ.. మొత్తం వాటా కొనుగోలు!

Aug 16 2023 11:39 AM | Updated on Aug 16 2023 12:33 PM

Adani Group set to acquire remaining 51pc stake in Quintillion Business Media - Sakshi

న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్‌ బెహల్‌ నెలకొల్పిన డిజిటల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియాలో (క్యూబీఎంఎల్‌) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ (ఏఎంఎన్‌ఎల్‌) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.

లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్‌ఎల్‌కు క్యూఎంఎల్‌ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్‌ పేరిట మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే క్యూబీఎంఎల్‌లో ఏఎంఎన్‌ఎల్‌ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది.

గతంలో బ్లూమ్‌బెర్గ్ క్వింట్‌గా పిలిచే బీక్యూ ప్రైమ్‌ను  యూఎస్‌ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ మీడియా, భారత్‌కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్‌బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement