'ఇళ్ల స్థలాలు రాలేదని..' సెల్‌ టవరెక్కి ఇద్దరు వ్యక్తులు హల్‌చల్‌!

- - Sakshi

సెల్‌ టవరెక్కి నిరసన తెలిపిన ఇద్దరు వ్యక్తులు

సర్వే చేసిన జాబితాలో ఉన్న పేర్లు, పంపిణీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం!

భద్రాద్రి: ధన్‌బాద్‌ పంచాయతీ రెండో వార్డు సభ్యుడు, మాయాబజార్‌కు చెందిన పిచ్చేటి శివకుమార్‌, దనసరి బన్ను తమకు ఇళ్ల స్థలాలు రాలేదని సోమవారం 5 ఇంక్‌లైన్‌లో సెల్‌ టవరెక్కి నిరసన తెలిపారు. మాయాబజార్‌ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయే వారికి ఈ నెల 3న సింగరేణి ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు 347 మందికి 100 గజాల చొప్పున కొత్తగూడెం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థలాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో శివకుమార్‌, బన్ను మనస్తాపం చెంది సెల్‌టవర్‌ ఎక్కా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తల్లి దండ్రుల కాలం నుంచి సుమారు 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. వీకే–7ఓసీ విస్తరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వేరే చోట స్థలాలు ఇస్తామని సింగరేణి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు చెప్పారని తెలిపారు.

సర్వే చేసిన జాబితాలో ఉన్న పేర్లు, పంపిణీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పేర్లు చేర్చారని, తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝెర్రా కామేష్‌ అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. దీంతో బాధితులు టవర్‌ దిగారు.

అనంతరం పొంగులేటి ఫోన్‌ ద్వారా సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. కామేష్‌ మాట్లాడుతూ వీకే–7ఓసీ విస్తరణ బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జాబితాలో కొందరు బాధితుల పేర్లు లేకుండా చేశారని, యూనియన్‌ నాయకులు, సొంత ఇళ్లు ఉన్నవారి పేర్లు అక్రమంగా చేర్చారని పేర్కొన్నారు. నేడు జరిగే పట్టాల పంపిణీని నిలిపివేసి, మళ్లీ సమగ్ర సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు.

సెల్‌ టవరెక్కిన మరో నిర్వాసితుడు
ఇంటి స్థలం మంజూరు కాలేదని సోమవారం రాత్రి ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన యువకుడు రవితేజ కూడా రుద్రంపూర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. ఓసీ విస్తరణ నిర్వాసితులకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల జాబితాలో పేరు లేకపోవడంతో ఆర్కే స్వామి చిన్న కుమారుడు రవితేజ సెల్‌ టవరెక్కి సుమారు మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. త్రీ టౌన్‌ సీఐ మురళి, డీటీ తిరుమల తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పారు. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యువకుడు సెల్‌టవర్‌ దిగాడు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం.. 
14-11-2023
Nov 14, 2023, 15:16 IST
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని..
14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...



 

Read also in:
Back to Top