సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కోర్టులో శనివా రం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి ప్రేమలత జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల త్యా గాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజేందర్, కర్నాటి కవిత, పూజిత, రవికుమార్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి, కార్యవర్గ సభ్యులు గడదాసు నాగరాజు, బానోత్ దేవదాస్, ఉమ, దొడ్డ ప్రసాద్, సంధ్యారాణి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


