రేపు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం నిరసనలు | Ysrcp Panchayat Raj Wing Protests On April 27th | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం నిరసనలు

Apr 26 2026 8:34 AM | Updated on Apr 26 2026 8:34 AM

Ysrcp Panchayat Raj Wing Protests On April 27th

సాక్షి, అమరావతి: పంచాయతీ రాజ్‌ శాఖలో పెండింగ్‌ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement